Koushalam Survey in Andhra Pradesh Process & Report
Koushalam Survey 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చదువుకొని గతంలో చేసిన Work From Home Survey లో భాగమైన వారి వద్ద నుండి పూర్తి చదువు కు సంబంధించి వివరాలను తీసుకొని వారికి భవిష్యత్తులో ఇంటి వద్ద నుండే పని లేదా రాష్ట్రంలో ఎక్కడైనా సరే ప్రభుత్వ లేదా ప్రైవేటు జాబ్ నోటిఫికేషన్లు విడుదలయితే అందులో వారికి భాగం చేయడం గాని లేదా నోటిఫికేషన్ విషయాలు తెలియజేసేందుకు లేదా ఇంటర్వ్యూకు ఆహ్వానించేందుకు Koushalam Survey 2025 ను ప్రభుత్వం చేపట్టింది.
ముందుగా Koushalam Survey 2025 ను Work From Home New గా పిలవటం జరిగింది తర్వాత పేరు మార్పు అయింది. ఈ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఆ సచివాలయ పరిధిలో గతంలో ఎవరికైతే వర్క్ ఫ్రం హోం సర్వేలో భాగమై వారి వివరాలు నమోదు చేసి ఉంటారు వారి పేర్లు మాత్రమే వస్తాయి, స్వతహాగా చదువుకున్న వారు మాకు సర్వే చేయండి అంటే అవ్వదు. ఈ సర్వేలో ఆగస్టు 15 2025 వరకు కేవలం ITI, Diploma, Graduation, PG, PHD, PG Diploma చదువుకున్న వారికి మాత్రమే అవకాశం ఉండేది, ఆగస్టు 15న విడుదలైన New GSWS Employees App మొబైల్ యాప్ నందు Intermediate, 10th Class, Below 10th Class చదువుకున్న వారికి కూడా అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఏదైనా కోర్సు అనగా డిగ్రీ, బీటెక్, ఇతర గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇతర పై చదలు చదువుతున్నట్లయితే వాటిని తెలియజేస్తూ ప్రస్తుతం చదువుతున్నారని కూడా అప్డేట్ చేసేందుకు కూడా అప్డేట్ రావడం జరిగింది.
ఈ సర్వే చేస్తున్న గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందరూ కూడా కొత్తగా అప్డేట్ అయిన మొబైల్ యాప్ ను కింద లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
Download GSWS Employees App
డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మొబైల్ యాప్ నందు లాగ్ అవుట్ అయ్యి, మరలా లాగిన్ అయినట్లయితే అప్పుడు పైన చెప్పిన కొత్త ఆప్షన్లన్ని కూడా మీకు కనిపిస్తాయి. GSWS Employees App లొ Koushalam Survey 2025 ను గ్రామ వార్డు సచివాల సిబ్బంది చేస్తున్నారు.
Koushalam Survey 2025 New options
కొత్తగా విడుదలైన మొబైల్ యాప్ లో వచ్చిన ఆప్షన్లు..
- ఇంటర్మీడియట్, పదవ తరగతి, పదో తరగతి కన్నా తక్కువ చదువుతున్న వారి వివరాలను కూడా అప్డేట్ చేయవచ్చు.
- ప్రస్తుతం ఏదైనా కోర్సు చదువుతున్నట్లయితే చదువుతున్నారని కూడా అప్డేట్ చేయవచ్చు.
- సర్వే ప్రారంభంలో అడిగే మొబైల్ ఓటిపి ఈమెయిల్ ఓటిపి అవసరం లేనిచో అవి లేకుండానే సర్వే పూర్తి చేయవచ్చు.
సర్వేలో పేరు ఉన్నవారు తప్పనిసరిగా బయోమెట్రిక్ లేదా ఫేస్ లేదా ఓటీపీ ద్వారా సర్వే ప్రారంభించాల్సి ఉంటుంది, అంటే సంబంధిత సచివాలయ సిబ్బంది ఎవరి పేరు వస్తే వారి బయోమెట్రి లేదా ఫేస్ లేదా ఓటీపీ ద్వారా సర్వేను స్టార్ట్ చేస్తారు. తర్వాత పైన చెప్పినట్టుగా మొబైలు, ఇమెయిల్ ఐడి కు ఓటిపి అవకాశం ఉంటే ఇవ్వవచ్చు లేకపోతే ఓటిపి లేకుండానే సర్వేను ముందుకు సాగించవచ్చు. ఏం చదువుకున్నారో దానికి సంబంధించి నమోదు చేస్తూ సర్టిఫికెట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది చదివిన సంవత్సరం, ఎంత పర్సంటేజ్ లేదా పాయింట్లు వచ్చాయో ఆ వివరాలు, ఎక్కడ చదివారు, ఏ కాలేజీలో లేదా పాఠశాలలో చదివారు, ఏం చదివారు వంటి వివరాలతో కూడిన ప్రశ్నలు ఈ సర్వేలో ఉంటాయి.
Koushalam Survey Report Link
ఈ సర్వే కి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల వారీగా ఏ క్లస్టర్లో ఎంతమందికి చేశారు అదేవిధంగా మండలాల వారీగా జిల్లాల వారీగా రిపోర్ట్ తెలుసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది కింద ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి నేరుగా ఈ కౌశలం సర్వే రిపోర్ట్ ను మీరు తెలుసుకోవచ్చు.
Koushalam Survey 2025 Report Link
Koushalam Survey Quations Asked
కౌశలం సర్వేలో అడిగే ముఖ్యమైన ప్రశ్నలు.
- తెలిసిన భాషలు ఎన్ని అవి ఏంటి
- విద్య అర్హత ఏంటి
- విద్యా అర్హతలు స్పెషలైజేషన్ ఏమిటి
- వచ్చిన మార్కులు లేదా జిపిఏ ఎంత
- ఏ సంవత్సరం పాస్ అయ్యారు
- పాస్ అయినట్టు ఒరిజినల్ డాక్యుమెంట్ ఫోటో అప్లోడ్ చేయాలి. బయట ఉంటే ఫోటో తీసి అప్లోడ్ చేయొచ్చు లేదా ఫోన్లో ఉన్నట్లయితే అప్లోడ్ చేసి అప్లోడ్ చేయొచ్చు.
- ఎక్కడ చదువుకున్నారు లొకేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
- ఇతర క్వాలిఫికేషన్ అంటే విద్యార్హతలు ఉంటే వాటిని కూడా నమోదు చేయవచ్చు. అప్పుడు మరల పైన వివరాలన్నీ కూడా అడుగుతాయి.
- అప్లోడ్ చేసిన సర్టిఫికెట్ యొక్క వివరాలను కూడా అవసరమైతే ఎంటర్