మే,జూన్ నెలల పింఛన్ సమాచారం మే,జూన్ నెలల పింఛన్ సమాచారం

మే,జూన్ నెలల పింఛన్ సమాచారం


  • మే, జూన్ నెలల పింఛన్ బ్యాంకు ఖాతాలో జమ 
  • 1వ తేదీనే పింఛను పంపిణీ మొదలు, 5 తో పూర్తి.
  • ఆధార్తో బ్యాంకు ఖాతా అనుసంధానం అయిన వారందరికీ ఈ విధానంలోనే నగదు జమ 
  • అనారోగ్యంతో పింఛను పొందుతున్న వారు, మంచం/వీల్చైర్కి పరిమితమైన వారికి ఇంటివద్దే పంపిణీ 
  • దివ్యాంగులు, అమరజవానుల భార్యలకూ ఇంటి వద్దే పింఛను .
  • రాష్ట్రంలో మొత్తం 65.49 లక్షల మంది లబ్ధిదారులు.. దాదాపు 48.92 లక్షల మందికి బ్యాంకు ఖాతాలో జమ 
  • ఖాతాలో జమ అయిన వెంటనే బ్యాంకు నుంచి మెసేజ్ 
  • ఎవరికి ఎలా పింఛన్ ఇస్తారన్న వివరాలు సచివాలయాల్లో ప్రదర్శన

 


DBT ద్వారా బ్యాంకు ఖాతా లొ నగదు జమ కానీ వారికి పెన్షన్ ఎలా ? 

ఆధార్ లింక్ లేనందున,NPCI Inactive వలన, ఇతర కారణాలతో DBT విధానం లొ పెన్షన్ దారుల బ్యాంకు ఖాతా లొ నగదు జమ అవ్వని వాటికి ఇంటింటికి నగదు ఇవ్వటం జరుగును. వాటికి సంబందించి నగదు గ్రామా / వార్డు సచివాలయాల ఖాతా లకు జమ అవుతుంది. DBT విధానం లొ ఫెయిల్ అయి నేరుగా ఇంటికి పెన్షన్ ఇవ్వవలసిన వారి లిస్ట్ త్వరలో విడుదల అవ్వటం జరుగును. నేరుగా బ్యాంకు ఖాతా లొ పెన్షన్ నగదు జమ [ DBT ] ద్వారా payment failure అయిన పింఛనుదారుల వివరాలు, ఇంటింటికి [ Door To Door ] ద్వారా payment చేయుటకు Pension App నందు enable చేయడం జరిగింది. 




ఏ బ్యాంకు ఖాతా కు నగదు జమ అవుతున్నాయి ?                           

DBT ద్వారా పెన్షన్ అమౌంట్ క్రెడిట్ అయిన వారికి సంబంధించి ఎవరికి అయితే పేమెంట్ సక్సెస్ అయిందో వారికీ ఏ బ్యాంక్ లో అయితే అమౌంట్ క్రెడిట్ అయిందో ఆ బ్యాంక్ వివరాలు గ్రామా వార్డు సచివాలయ సంబధిత WEA/WWDS SS PENSION LOGIN లో అవ్వడం జరిగింది.మిగిలిన పెన్షనర్స్ (DBT) వివరాలు కూడా త్వరలో UPDATE అవ్వడం జరుగుతుంది.అమౌంట్ DBT ద్వారా క్రెడిట్ అవ్వకపోతే వాళ్ళకి మరల DOOR TO DOOR ద్వారా పెన్షన్ పంపిణీ జరుగుతుంది.ప్రస్తుతం కొంతమంది DBT పింఛనుదారులకు మాత్రమే payment status & Account details update చేయడం జరిగింది. అన్నీ DBT pensions యొక్క payment status & account details త్వరలో అప్డేట్ చేయడం జరుగుతుంది. గమనించగలరు.గ్రామా వార్డు సచివాలయ సంబధిత WEA/WWDS SS PENSION LOGIN లో REPORT'S --->CURRENT MONTH PENSIONERS LIST--->DBT ద్వారా రిపోర్ట్ తెలుసుకోవచ్చు . 

 సచివాలయ సిబ్బంది లాగిన్ లో వచ్చే స్క్రీన్ 

పెన్షన్ నగదు క్రెడిట్ ఆయిన వారికి ఎలా SMS వస్తుంది ? 

DBT విధానం లొ పేమెంట్ అయిన వారికి కింద తెలిపిన విధానం లొ SMS వస్తుంది. 

Rs.3000 Credited to A/c ...6650 from:APBCR/PENSIONAMO. Total Bal:Rs.5283.41CR. Avlbl Amt:Rs.5047.41(01-05-2024 08:26:43) - Bank of Baroda.


పెన్షన్ పంపిణి విధానం :

పెన్షన్ పంపిణీ కింద తెలిపిన రెండు విధాలుగా జరుగుతుంది. 

A.Direct Beneficiary Transfer(DBT) : 

పెన్షనర్ల వక్తిగత బ్యాంకు అకౌంట్ కు మే 1 వ తారీకున జమకాబడుతుంది.

B. Door to Door disbursement of Pensions:

  1. Diffferently-Abled Category
  2. Serious Ailments
  3. Bed ridden and confirmed to wheelchairs 
  4. Widows of war veterans drawing sainik welfare 

గ్రామా / వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయడం జరుగుతుంది. 


పెన్షన్ అమౌంట్ డ్రా చేసుకోవటం : 

  • Door to Door disbursement of Pensions అకౌంట్స్ కు 30-04-2024 న జమ అవుతాయి.ఆ రోజు డ్రా చేసుకొని మే 1 వ తారీకు నుంచి 5 వ తారీకు వరకు సచివాలయం సిబ్బంది ద్వార Door to Door పంపిణి చేయవలయును. సదరు పెన్షనర్ల పేర్లు YSR Pension Kanuka మొబైల్ app నందు కనబడుతాయి.
  • Direct Beneficiary Transfer లో రిజెక్ట్ అయిన అకౌంట్స్ అమౌంట్ ను మరల సచివాలయం ఎకౌంటు కు జమచేయబడుతుంది.
  • బ్యాంకు నుండి పెన్షన్ అమౌంట్ విత్ డ్రా చేయువారు ఎంపీడీఓ / మునిసిపల్ కమీషనర్ లాగిన్ నందు అమౌంట్ విత్ డ్రా Authorisation లెటర్ డౌన్లోడ్ చేసికొని ఎంపీడీఓ/మునిసిపల్ కమీషనర్ సంతకం చేసిన కాపీ మీ దగ్గర ఉంచుకోవాలి (5వ తారీకు వరకు ).
  • ఒక (అన్ని సచివాలయం కు సంబంధించి) కాపీ ని రిటర్నింగ్ ఆఫీసర్ ఇవ్వవలయును.


పెన్షన్ పంపిణి : 

  • సెక్రటేరియట్ లో వున్న స్టాఫ్ కు లాగిన్లు create చేయబడతాయి. userid create చేసినతరువాత సెక్రటేరియట్ లో వున్న స్టాఫ్ లాగిన్ అవ్వవలయును.
  • ముందు వెల్ఫేర్ సెక్రటరీలు రూరల్ మరియు అర్బన్ మీ సచివాలయం లో పెన్షనర్ లు పేర్లు మొత్తం ప్రింట్ తAuthorisation
  • సెక్రటేరియట్ లో వున్న స్టాఫ్ మీ వెల్ఫేర్ నుంచి పంపిణీకి కావలసిన అమౌంట్ తీసుకోవలయును
  • AADHAR AUTHENTICATION (BIOMATRIC/IRIS /AADHAR FACE) ద్వారా పేమెంట్ చేసుకొనవలయును.
  • ఆధార్ AUTHENTICATION ఫెయిల్ అయినచో సచివాలయం సిబ్బంది RBIS ద్వారా పంపిణి చేయబడుతుంది.
  • పంపిణి చేసిన తరువాత ప్రతి రోజు మొత్తం ఎంత పంపిణీ అయినదో మిగిలిన అమౌంట్ ఎంతో మీరు మీ ఎంపీడీఓ / మునిసిపల్ కమీషనర్ గారికి వెల్ఫేర్ తెలియపరచవలయును.


తీసుకోవలసిన జాగ్రత్తలు : 

  • పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు ఫోటోలు, వీడియో లు తీయకూడదు మరియు publicity చేయకూడదు.
  • పెన్షన్ పంపిణి చేసేటప్పుడు సచివాలయ సిబ్బంది భారత ఎన్నికల సంఘం ఆదేశానికి అనుగుణంగా పెన్షన్లు పంపిణీ చేయవలసి ఉన్నది.

 

      

మే, జూన్ నెలల పింఛన్ డబ్బును ఈసారి లబ్దిదారులకు నేరుగా నగదు రూపంలో కాకుండా డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్(ఏఈపీఎస్) విధానంలో లబ్దిదారుల ఆధార్ నంబరు అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాలో నేరుగా పింఛను డబ్బు జమ చేస్తుంది. అయితే, విభిన్న దివ్యాంగ లబ్ధిదారులు, తీవ్రమైన అనారోగ్య కారణాలతో పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్బైరు పరిమితమైన వారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధవీరుల వృద్ధ వితంతువులకు మాత్రం గత నెలలో మాదిరిగానే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇంటి వద్దకే వచ్చి పింఛను డబ్బు ఇస్తారు. ఈ రెండు నెలల్లోనూ ఒకటో తేదీ నుంచే పింఛను డబ్బు పంపిణీ చేస్తారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సూచనలకు అనుగుణంగా పిం ఛన్ల పంపిణీ విధానంలో మార్పులు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఆదివారం ఆదేశాలు చేశారు. అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 


                                మే ఒకటో తేదీ నుంచి పంపిణీ చేసేం దుకు రాష్ట్రవ్యాప్తంగా 65,49,864 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి నిధులు విడుదల చేస్తుంది. అందులో 48,92,503 మంది (74.70 శాతం) లబ్ధిదారుల పింఛన్ డబ్బులు ఆధార్ నంబర్ తో అనుసంధానమై ఉన్న వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయి. లబ్ధిదారులకు ఒకటో తేదీనే డీబీటీ విధానంలో డబ్బులు జమ చేయగానే, ఆ సమాచారం బ్యాంకు నుంచి ఎస్ఎంఎస్ రూపంలో అందుతుంది. విభిన్న దివ్యాంగ వర్గానికి చెందిన లబ్ధిదారులు, తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్చైర్కు పరిమితమైన వారు దాదాపు 16,57,361 మంది (25.30 శాతం)కి మే ఒకటి నుంచి ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ జరుగుతుంది. పింఛన్ లబ్ధిదారులలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో వారికి డబ్బు అందేలా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఎవరికి పింఛను డబ్బులు బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తారు, ఎవరికి ఇంటి వద్దే పంపిణీ చేస్తారన్న వివరాలతో కూడిన జాబితాలను సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయం గ్రామ, వార్డు  సచివాలయాల్లో నోటీసు బోర్డులో కూడా ఉంచనున్నట్టు అధికారులు చెబుతున్నారు. 


ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలకు గాను నగదును డైరెక్టర్గా బ్యాంకు ఖాతాలో కాకుండా ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి బ్యాంకు ఖాతాలో మాత్రమే నగదును జమ చేయడం జరుగుతుంది. కావున సంక్షేమ పథకాలకు అర్హులైనటువంటి వారు వారి ఆధార్ కార్డు ఏ బ్యాంకు ఖాతాకు లింక్ అయినదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆధార్ కార్డుకు ఏ బ్యాంకు కాకా లింక్ అయినదో తెలుసుకునేందుకు తప్పనిసరిగా ఆధార్ కార్డుకు ఫోను నెంబర్ లింక్ అయ్యి ఉండాలి.


Click Here to Download Latest YSR Pension Kanuka App and Scanner Apps 


ఆధార్ కార్డుకు , మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము 
 
Click Here


ఆధార్ కార్డు ఏ బ్యాంకు ఖాతాకు లింక్ అయినదో తెలుసుకునే విధానము:

Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయాలి.

Click Here

Step 2 : 12 అంకెల ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి, కింద చూపిస్తున్న సెక్యూరిటీ కోడ్ను ఎంటర్ చేసి Send OTP పై క్లిక్ చెయ్యాలి. My Aadhaar Mobile App ద్వారా TOTP ను జనరేట్ చెయ్యవచ్చు.


Step 3 : మొబైల్ కు వచ్చిన 6 అంకెల OTP ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.వెంటనే "Congratulation! Your Aadhaar - Bank Mapping has been done" అని చూపిస్తే బ్యాంకు అకౌంట్ - ఆధార్ లింక్ అయినట్టు. 

  • Bank Seeding Status - Active లొ ఉంటే లింక్ అయి నట్టు అర్థము. 
  • Bank Seeding Date లొ ఏ రోజు లింక్ అయినదో చూపిస్తుంది.
  • Bank వద్ద ఏ బ్యాంకు కు లింక్ అయినదో చూపిస్తుంది.




మరింత సమాచారం >>
close