Government of Andhra Pradesh Revises NTR Bharosa Pension Scheme Guidelines
AP NTR Bharosa Pensions Cancellation Update : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా NTR Bharosa Pension Scheme ద్వారా అర్హత లేకపోయినా పెన్షన్ తీసుకుంటున్నటువంటి Health & Disable Pensions update పింఛన్లను రద్దు చేసేందుకు మరియు కొత్త సదరం సర్టిఫికెట్ల ప్రకారం పెన్షన్ను మార్పు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది.
Key Updates on SADAREM Certificate and Pension Eligibility
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య మరియు వికలాంగుల పింఛన్దారులకు సదరం పున పరిశీలన జరిగిన విషయం తెలిసిందే. ఎవరైతే వారికి ఇచ్చినటువంటి నోటీసు ఆధారంగా సంబంధిత ఆసుపత్రులలో పున పరిశీలన చేసుకున్నారో వారికి పున పరిశీలనలో డాక్టర్ వారి రికమండేషన్ ప్రాప్తికి కొత్త సదరం సర్టిఫికెట్ రావడం జరిగింది. అందులో ఎవరికైతే 40% కన్నా తక్కువ శాతం ఉంటుందో వారికి పింఛను రద్దు అవడం లేదా పించను రకము మార్పు చేయడం జరుగుతుంది. అదే 40-85% ఉంటే వారికి వికలాంగుల పెన్షన్ 6000 ఇవ్వటం జరుగుతుంది.
How Ineligible Pensions Will Be Converted or Cancelled
గతంలో 15 వేల రూపాయల పెన్షన్ పొందుతుంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం వీల్ చైర్ లేదా బెడ్ పై ఉన్నటువంటి పెరాలసిస్ బాధితులు లేదా తీవ్రమైన మస్క్యులర్ డిస్ట్రోఫీ లేదా ప్రమాద బాధితులు వీరు 15 వేల రూపాయల పెన్షన్ పొందుతున్నారు. వీరిలో సదరం పునః పరిశీలనకు వెళ్లిన తర్వాత కొత్త సదరం సర్టిఫికెట్లు వారికి వచ్చిన శాతం ప్రకారం వారి పెన్షన్ మార్పు లేదా రద్దు నిర్ణయించడం జరుగుతుంది. కొత్తగా వచ్చినటువంటి సదరం సర్టిఫికెట్లు సదరం శాతం 40% - 85% మధ్య ఉంటే వారి పెన్షన్ వికలాంగుల పెన్షన్ గా అంటే నెలకు 6000 రూపాయలుగా మార్పు జరుగుతుంది. అదే సదరం శాతం 40% కంటే తక్కువగా ఉన్న లేదా సర్టిఫికెట్ తాత్కాలికమైన వారి యొక్క పెన్షన్ రద్దు అవడం జరుగుతుంది. సదరం శాతం 40% కన్నా తక్కువ ఉంటూ లేదా సర్టిఫికెట్ తాత్కాలిక సర్టిఫికెట్ అయితే వారి ఇంట్లో ఎవరు కూడా పెన్షన్ తీసుకోకుండా పింఛన్దాడి యొక్క వయసు 60 సంవత్సరాలు పైబడి ఉన్నట్టయితే వారి పెంచను 15000 నుండి 4 వేల రూపాయలకు వృద్ధాప్య పెన్షన్ గా మార్పు చేయడం జరుగుతుంది.
ప్రస్తుత పెన్షన్ రకం | SADAREM సర్టిఫికెట్ | చర్య |
---|---|---|
పారాలిసిస్ (వీల్చెయిర్/బెడ్) | 40%-85% వికలాంగత | ₹6,000కు మార్పు |
మస్క్యులర్ డిస్ట్రోఫీ/ప్రమాద బాధితులు | 40% కంటే తక్కువ | పెన్షన్ రద్దు |
మస్క్యులర్ డిస్ట్రోఫీ/ప్రమాద బాధితులు | 40% కంటే తక్కువ + 60+ వయస్సు | వృద్ధాప్య పెన్షన్ (₹4,000) |
గతంలో 6 వేల రూపాయల పెన్షన్ పొందుతుంటే
అన్ని రకముల వికలాంగ తత్వం కలిగిన వికలాంగ పింఛను 6000 పొందుతున్న వారు ఎవరైతే ఉంటారో వారికి తప్పనిసరిగా సదరం శాతం 40 లేదా 40 కన్నా ఎక్కువ ఉండాలి. 40 శాతం ఉన్న వారికి వికలాంగుల పెన్షన్ రావడం జరుగుతుంది. సదరం పునః పరిశీలనకు వెళ్లిన తర్వాత కొత్తగా వచ్చిన సదరం సర్టిఫికెట్లో సదరం శాతం 40% కన్నా తక్కువ ఉన్న లేదా సర్టిఫికెట్ తాత్కాలిక సర్టిఫికెట్ వచ్చిన వారి యొక్క పెన్షన్ రద్దు అవడం జరుగుతుంది. అదే సదరం శాతం 40% కన్నా తక్కువ ఉంటూ సర్టిఫికెట్ తాత్కాలిక సర్టిఫికెట్ అవుతూ వారి ఇంట్లో ఎవరు కూడా పెన్షన్ తీసుకొని వారు ఉంటూ వారి వయసు 60 సంవత్సరాలు పైబడి ఉంటే వారి పెన్షన్ 6000 నుండి 4000 రూపాయలకు అంటే వికలాంగుల పెన్షన్ నుండి వృద్ధాప్య పెన్షన్కు మార్పు చేయడం జరుగుతుంది.
ప్రస్తుత పెన్షన్ | కొత్త SADAREM శాతం | చర్య |
---|---|---|
వికలాంగుల పెన్షన్ (₹6,000) | 40% కంటే తక్కువ | పెన్షన్ రద్దు |
వికలాంగుల పెన్షన్ (₹6,000) | 40% కంటే తక్కువ + 60+ వయస్సు | వృద్ధాప్య పెన్షన్ (₹4,000) |
కొత్త సదరం సర్టిఫికెట్ ఎలా పొందాలి ?
How to Download Revised SADAREM Certificate in Andhra Pradesh
ఎవరైతే రాష్ట్రంలో ఆరోగ్య మరియు వికలాంగుల పెన్షన్లు పొందుతున్న వారు పునాహ పరిశీలనకు గతంలో వెళ్లారు వారందరికీ కూడా సంబంధిత చెకింగ్ చేసిన డాక్టర్ వారి రికమండేషన్ ప్రాప్తికి కొత్త సదరం సర్టిఫికెట్లు విడుదలవ్వడం జరిగింది. సంబంధిత కొత్త సదరం సర్టిఫికెట్లు గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అధికారి వార్డు సచివాలయంలో డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారి AP Seva Portal లాగిన్ నందు ఇవ్వటం జరిగింది. ఆయా కొత్త సదరం సర్టిఫికెట్లు ఒకసారి మాత్రమే డౌన్లోడ్ చేసుకునేందుకు సంబంధిత అధికారులకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సంబంధిత అధికారులు ముందుగానే డౌన్లోడ్ చేసుకొని వారి వద్ద సర్టిఫికెట్లు ప్రింట్ తీసి ఉంచడం జరుగుతుంది.
అవి నేరుగా సచివాలయం కి పింఛన్దాడు వెళ్తే ఇవ్వరు. అయ్యా కొత్త సదరం సర్టిఫికెట్లు పింఛన్దారుడి ఇంటి వద్దకే వచ్చి సంబంధిత సచివాల సిబ్బంది ఇవ్వటం జరుగుతుంది కొత్త సదరం సర్టిఫికెట్లతో పాటుగా పెన్షన్ నోటీసు కూడా అందించడం జరుగుతుంది. పెన్షన్ నోటీసులో సదరం సర్టిఫికెట్లు ఉన్నటువంటి సదరం శాతం ప్రకారం పెన్షన్ రద్దయిందా లేదా పెన్షన్ అనేది ప్రస్తుతం తీసుకుంటున్న పెన్షన్ నుంచి వృద్ధాప్య పెన్షన్కు లేదా వికలాంగుల పెన్షన్లకు మార్పు చేయడం జరిగిందా అని పూర్తి సమాచారం నోటీసులు జరుగుతుంది.
పెన్షన్ రద్దయిందా లేదా మార్పు చెందిందా అని ఎలా తెలుసుకోవాలి ?
రాష్ట్రవ్యాప్తంగా పునా పరిశీలనకు హాజరైనటువంటి మెడికల్ మరియు వికలాంగుల పెన్షన్ దారులు వారి యొక్క పెన్షన్ రద్దు అయిందా లేదా పెన్షన్ ప్రస్తుత తీసుకుంటున్న పెన్షన్ నుంచి వృద్ధాప్య లేదా వికలాంగుల పెన్షన్లకు మార్పు చేయడం జరిగిందా అని తెలుసుకునేందుకు వారికి నేరుగా ఆప్షన్ అంటూ ఆన్లైన్లో ఏమి ఉండదు. సంబంధిత సచివాలయ సిబ్బంది ఎవరైతే మీకు రెగ్యులర్గా పెన్షన్ ఇస్తుంటారు. వారు మీ ఇంటి వద్దకే కొత్త సదరం సర్టిఫికేట్ మరియు నోటీసులు రెండు తీసుకురావడం జరుగుతుంది రెండు నోటీసులో ఒక నోటీస్ పై మీరు సంతకం చేసి వారికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా మొబైల్ యాప్ లో కూడా నోటీసు మరియు కొత్త సదరం సర్టిఫికెట్ మీకు అందించినట్టు మీ వద్ద బయోమెట్రి తీసుకోవడం జరుగుతుంది. ఆ నోటీసులోనే మీకు పెన్షన్ ప్రస్తుతం తీసుకుంటున్న పెన్షన్ కంటిన్యూ అవుతుందా లేదా వృద్ధాప్య లేదా వికలాంగుల పెన్షన్లకు మార్పు చేయడం జరుగుతుందా లేదా కొత్త సదరం సర్టిఫికెట్లో వికలాంగుల సదరం శాతం 40% కన్నా తక్కువ ఉన్నట్టయితే పెన్షన్ రద్దు అవడం జరుగుతుందా అనే పూర్తి వివరాలు నోటీసులో ఉంటాయి.
గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారుల లాగిన్ లో మెడికల్ మరియు వికలాంగుల పెన్షన్ల నోటీసు డౌన్లోడ్ చేసుకునేందుకు ఇచ్చిన ఆప్షన్
అర్హులైన కూడా అనర్హులుగా ప్రకటిస్తూ పెన్షన్ రద్దు చేస్తే ఏం చేయాలి?
Appeal Process for Disputed Pension Decisions
అర్హులైన సరే అనర్హులుగా చూపిస్తూ పెన్షన్ రద్దు అయితే లేదా పెన్షన్ రకము మారితే వారు అర్జీ నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కూడా కల్పించింది. ఈ విధమైన సమస్య ఉన్నవారు ముందుగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు GGH, RIMS, జిల్లా ఆస్పత్రిలో, ఏరియా ఆసుపత్రులలో ముందుగా మాన్యువల్ Medical Certificate పొందాల్సి ఉంటుంది.
మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్, పెన్షన్ పునరుద్ధరణ లేదా మార్పు నిరాకరణకు సంబంధించి లెటర్, సంబంధిత మెడికల్ సర్టిఫికెట్లు డాక్యుమెంట్లతో పింఛన్దారుడు వారి MPDO / మున్సిపల్ కమిషనర్ వద్ద ఆపిల్ లేదా అర్జీ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పించన్ దారుణకు సదరం సర్టిఫికెట్ అందిన లేదా నోటీస్ అందిన తేదీ నుండి 30 రోజుల్లోపు చేసుకోవలసి ఉంటుంది.
ఎవరైతే ఆపిల్ లేదా అర్జీ నమోదు చేసుకుంటారు వారికి పున పరిశీలన కొరకు పైన చెప్పిన ఆసుపత్రులలో సంబంధిత MPDO / MC వారు నోటీసును ఎవరైతే అర్జీ నమోదు చేసుకుంటారో వారికి ఇవ్వటం జరుగుతుంది. MPDO / MC అధికారులు ఇచ్చిన తేదీ మరియు టైం ప్రకారం సంబంధిత పింఛన్దారులకు సంబంధిత ఆసుపత్రులలో ఆసుపత్రులలో రీ అసెస్మెంట్ పున పరిశీలన జరుగుతుంది.
రీ అసెస్మెంట్ పున పరిశీలన పూర్తయిన తర్వాత కొత్త సదరం సర్టిఫికెట్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. కొత్త సదరం సర్టిఫికెట్లో ఉన్న సదరం శాతం ప్రకారం వారికి పెన్షన్ పునరుద్ధరణ లేదా పెన్షన్ రద్దు లేదా పెన్షన్ రకము మార్పు జరుగుతుంది.
దశ | చర్య | సమయ పరిమితి |
---|---|---|
1 | GGH/జిల్లా ఆసుపత్రిలో మెడికల్ టెస్ట్ | నోటీసు తేదీ నుండి 7 రోజులు |
2 | MPDOకు అప్పీల్ సమర్పించడం | 30 రోజులు |
3 | పునర్విమర్శ తేదీ | అప్లికేషన్ తేదీ నుండి 15 రోజులు |
ఏది ఎప్పుడు జరుగుతాయి ?
Important Deadlines for Revised SADAREM Certificates and Pension Adjustments
జులై 31 2025 నాటికి ఎవరికైతే కొత్త సదరం సర్టిఫికెట్లు జారీ చేయబడతాయో వారికి పైన చెప్పిన ప్రాసెస్ అంతా ఆగస్టు 25 లోపు పూర్తి కావాల్సి ఉంటుంది అలా పూర్తయిన వారికి సెప్టెంబర్ 1 2025 నుండి పెన్షన్ రద్దు లేదా పెన్షన్ పునరుద్ధరణ లేదా పెన్షన్ రకము మార్పు అనేది జరుగుతుంది. దాని ప్రకారమే వారికి పెన్షన్ పంపిణీ జరుగుతుంది. పెన్షన్ రద్దు అయిన వారికి సెప్టెంబర్ ఒకటి 2025 నుండి పెన్షన్ నగదు అందదు. ఈ ప్రక్రియ ఆ నెలలో చివరి తేదీ నాటికి కొత్త సదరం సర్టిఫికెట్ పొందిన వారికి మరుసటి నెల 25వ తేదీ తారీకు లోపు ప్రక్రియ అంతా పూర్తయి ఆమనసటి నెల ఒకటో తేదీ నాటికి పెన్షన్ పునరుద్ధరణ లేదా రద్దు లేదా మార్పు జరుగుతాయి.